అఫీషియల్: మహేష్ ‘మహర్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘భరత్ అనే నేను’ తరువాత.. మహేష్ బాబు చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం మహర్షి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ప్రారంభం రోజునే సినిమా రిలీజ్ ను ఏప్రిల్ 5 న అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనుకోని అవాంతరాల వలన సినిమాను ఏప్రిల్ 25 కు పోస్ట్ ఫోన్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు.

అయితే అప్పటికే దేశంతో పాటు ఆంధ్రాలో ఎన్నికల హడావుడి ఉండటంతో వంశీ పైడిపల్లి ఈసినిమాను ఆలస్యంగా చేస్తున్నాడనే కారణాలతో ఈ సినిమా జూన్‌కి వాయిదా పడిందని మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో మహేష్ ..వంశీ పైడిపల్లిపై సీరియస్ అయ్యినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్దితుల్లోనూ ఏప్రియల్ 25 న విడుదల చేయాలని అన్నారట. దాంతో అఫీషియల్ గా ఈ డేట్ ని ప్రకటించారు.

అయితే సినిమాలో రెండు పాటలు మినహా మిగిలిన షూటింగ్ మార్చి ఫస్ట్ వీక్ వరకు కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. దాంతో ఇప్పటికే ప్రకటించిన ఏప్రిల్ 25నే ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారని నిర్మాతలు ప్రకటించారు.

దిల్ రాజు, సి అశ్విని దత్, పివిపి సినిమా కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మహేష్ బాబు 25 వ సినిమాగా వస్తున్న మహర్షిలో మహేష్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. వంశి పైడిపల్లి దర్శకుడు.