‘మహర్షి’పై దిల్ రాజు మళ్లీ అదే మాట

మొత్తానికి గత కొన్ని రోజులుగా మహేష్ తాజా చిత్రం ‘మహర్షి’ సినిమా రిలీజ్ డేట్ పై మీడియాలో జరుగుతున్న డిస్కషన్ కు ఫుల్‌స్టాప్‌ పడింది. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్‌ 25నే చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు నిర్మాత దిల్‌రాజు ఇంకోసారి స్పష్టం చేశారు.

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ నిర్మిస్తున్న సినిమా ‘మహర్షి’. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్‌ 5న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆ తర్వాత ఆ తేదీకి ‘మహర్షి’ విడుదల కావడం లేదని, ఏప్రిల్‌ 26కు వాయిదా పడిందని వార్తలు వచ్చాయి. ఫైనల్‌గా ఈ సినిమాను ఏప్రిల్‌ 25న విడుదల చేయనున్నట్లు నిర్మాత ఖరారు చేసారు.

ఇక ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ ఏక్టివిటీస్ తో ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. అలాగే ఈ చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలబడతాయని సమాచారం. ఈ మేరకు ప్రత్యేకంగా వంశీ పైడిపల్లి కసరత్తు చేసి రూపొందించాడని సమాచారం.

. ప్రస్తుతం ‘మహర్షి’ షూటింగ్‌ పొల్లాచ్చిలో జరుగుతోంది. కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌ ఈ నెల 28 వరకు జరుగుతుంది. ఆ తర్వాత దుబాయ్‌లో చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. ఈ సినిమాలో మహేష్‌.. రిషిగా, ఓ కొత్త రకమైన గెటప్‌లో కనిపించబోతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ‘అల్లరి’ నరేశ్‌ కీలక పాత్ర చేస్తున్నారు.