కేక పెట్టించిన ‘సైరా’ కర్ణాటక రైట్స్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని భారీ రేట్లకు అమ్ముతున్నట్లు సమాచారం. చిరు తనయుడు రాంచరణ్ నిర్మాణంసో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని కూడా చరణ్ నిర్మించిన విషయం తెలిసిందే . ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో సైరా ని భారీ రేట్ల కు అమ్మాలని డిసైడ్ అయ్యారు.

ఇప్పటికే చాలా ఏరియాలు ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కర్ణాటక రైట్స్ 32 కోట్లకు అమ్మినట్లు సమాచారం. బాహుబలి తర్వాత కర్ణాటకలో ఈ రేటు కు డీల్ కుదుర్చుకుంది ఈ సినిమానే కావటం గమనార్హం. థియేట్రికల్ రైట్స్ మాత్రమే కాకుండా డిజిటల్ రైట్స్ , శాటిలైట్ , హిందీ డబ్బింగ్ తదితర హక్కుల రూపంలో 300 కోట్లు అవలీలగా దాటడం ఖాయమని భావిస్తున్నాడట చరణ్ .

తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతోన్న ’సైరా’పై మంచి అంచనాలే ఉన్నాయి. ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘సైరా’ ట్రైలర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.