‘ఫలక్ నుమా దాస్’కు దిమ్మ తిరిగే ఆఫర్

విశ్వక్‌ సేన్‌ దర్శకుడిగా – హీరోగా, కరాటీ రాజు నిర్మాణంలో వచ్చిన చిత్రం ‘ఫలక్ నుమా దాస్’. హర్షిత గౌర్, సలోని మిశ్రా హీరోయిన్స్ గా నటించగా, దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో గత శుక్రవారం విడుదల అయిన ఈ చిత్రం రిలీజ్ రోజు మార్నింగ్ షోకే కష్టం అనే టాక్ తెచ్చుకుంది. అయితే విశ్వక్ సేన్ తెలవిగా ప్లే చేసిన పబ్లిసిటీ ట్రిక్ బాగానే పనిచేసి నైజాంలో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతుంది.

ఇదిలా ఉంటే ఈ చిత్రం ఈ సినిమా డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ కు అమ్మేసారనే వార్త మీడియాలో మొదలైంది. ఈ చిత్రం ఒరిజనల్ అంగనమల డైరీస్ చిత్రం డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ వారే తీసుకున్నారు. దాంతో ఈ ఫలక్ నుమా రైట్స్ ని కూడా సుమారు రెండుకోట్ల రూపాయలకు నెట్ ఫ్లిక్స్ కు డిజిటల్ హక్కులు ఇచ్చేసారని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు శాటిలైట్ రైట్స్ కూడా ఇంకా అమ్మలేదు. ఆ డబ్బులు వస్తాయి ఈ సినిమా నిర్మాణానికి, పబ్లిసిటీకి కలిపి దాదాపు అయిదు కోట్ల వరకు ఖర్చు అయింది. అయితే నైజాం నుంచి వచ్చిన డబ్బులు, సురేష్ ప్రొడక్షన్స్ అడ్వాన్స్ గా ఇచ్చిన డబ్బు, నెట్ ఫ్లిక్స్ డబ్బులు అన్ని కలిసి లాభాల్లో పడినట్లే అని చెప్తున్నారు.

ఆంధ్రాలో వర్కవుట్ కాకపోయినా నైజాంలో ఈ చిత్రానికి ఆదరణ బాగుంది. పక్కా హైదరాబాద్ నేపథ్యంలో తెరెకెక్కిన ‘ఫలక్ నుమా దాస్’ నైజాం జనాన్ని బాగా ఆకట్టుకుంటుంది. నైజాంలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మూడు కోట్ల మార్క్ చేరుకునే అవకాశం ఉందని అంచనా.