రజనీ సినిమాకూ… నాకు సంభందం లేదు..రచ్చ చేయద్దు

రజనీకాంత్ తాజా చిత్రం ‘పెట్టా’ సినిమా తెలుగు హక్కులను తాను సొంతం చేసుకున్నట్లు వస్తున్న మీడీయాలో వస్తున్న వార్తలను ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ ఖండించారు. ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు తాను రిలీజ్ డేట్ మార్చమని అడిగినట్లు కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయని..అసలు రైట్సే తనవి కానప్పుడు తనకు సంభంధం ఏమిటని అన్నారు.

ఆ సినిమా హక్కులకు, తనకూ ఎంత మాత్రం సంబంధం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నానని, సన్ పిక్చర్స్ వారికి కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినట్లు సి.కళ్యాణ్ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. రజనీకాంత్ అంటే తనకెంతో గౌరవమని, ఆయనతో చిత్రాలు చేయాలని అందరికీ ఉంటుందని తెలిపారు. అయితే ‘పెట్టా’ చిత్రం హక్కుల గురించి తాను ఎలాంటి చర్చలు జరపలేదని, మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు సి.కల్యాణ్ వెల్లడించారు.

సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలకి కేవలం తమిళంలోనే కాదు..తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. రీసెంట్ గా రజనీకాంత్-శంకర్ కలయికలో రూపొంది రిలీజైన 2.0. చిత్రం సైతం తెలుగులోనూ భారీ ఎత్తున రిలీజై మంచి హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా సెట్ పై ఉండగానే రజనీ మరో చిత్రాన్ని అంగీకరించిన విషయం తెలిసిందే. వినూత్న చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సన్ పిక్చర్స్ పతాకంపై అత్యంత భారీ స్థాయిలో తమిళంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి పేట్ట అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రజనీ నటిస్తున్న 165వ చిత్రమిది. త్రిష, సిమ్రాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీసింహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ మూవీని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించగా అనిరుద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.