వాగా బోర్డర్ లో సల్మాన్ , కత్రినా

హిందీ సినిమా రంగంలో ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకొనే సినిమా “భారత్ “. ఈ సినిమా భారత్ , పాకిస్తాన్  విడిపోయే సమయంలో జరిగిన ఘటనల సమాహారం . దీనిని  “‘ఓడ్ టు మై ఫాదర్” అనే నవల  ఆధారంగా నిర్మిస్తున్నారు . అలీ అబ్బాస్ జాఫర్  దర్శకత్వంలో సల్మాన్ కహాన్, కత్రినా కైఫ్ , టబు, దిశా పటాని, జాకీ షరాఫ్ ,మెయియాంగ్ చాంగ్ , సునీల్ గ్రోవర్  నటిస్తున్నారు . ఈ చిత్రాన్ని దుబాయ్ , స్పెయిన్ , మాల్టా , ఢిల్లీ  మొదలైన చోట్ల చిత్రీకరించారు . పంజాబ్ లో 1947 నాటి వాతావరణం ప్రతిబింబించే ఓ సెట్ ను వేశారు . అప్పటి కాలానికి చెందిన దృశ్యాలను అక్కడే తీశారు .  ఈ సినిమా 100 కోట్లతో నిర్మిస్తున్నారు .

తాజాగా సల్మాన్ ఖాన్ , కత్రినా కైఫ్  వాగా బోర్డర్ దగ్గర నుంచున్నా ఫోటో ను విపరీతమైన క్రేజ్ తో చూస్తున్నారు . ఈ ఫోటో ను స్వయంగా సల్మాన్  ఖాన్  తన అభిమానుల తో పంచుకున్నాడు