ఆ తెలుగు సినిమా రీమేక్ లో కరణ్ జోహార్ బిజీ

భారతదేశంలో అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ అధిపతి కరణ్ జోహార్. ఆయన దృష్టి ఈ మధ్యకాలంలో సౌత్ సినిమాలపై పడింది. ఇక్కడ ఏ సినిమాలు హిట్ అవుతున్నాయో..ఏవి భారీ రిలీజ్ కు రెడీ అవుతున్నాయో ..గమనించి..వాటిని బిజినెస్ యాంగిల్ తో నార్త్ కు తీసుకువెళ్లి ఎలా వర్కవుట్ చేయవచ్చు అనే ఆలోచనలో ఉంటున్నారు.

అందులో బాగంగా ఇప్పటికే ‘బాహుబలి 1 ’, ‘బాహుబలి 2’ చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించిన కరణ్‌ త్వరలో విడుదల కానున్న ‘2.ఓ’ చిత్రానికి కూడా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఇప్పుడు మరో తెలుగు సినిమాని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఆ సినిమా మరేదో కాదు..

అడివి శేష్‌ నటించిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘గూఢచారి’ని హిందీలో రీమేక్‌ చేయనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ప్రముఖ బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని చూశారట. తనకు సినిమా కాన్సెప్ట్‌ బాగా నచ్చిందని, దీనిని రీమేక్‌ చేయాలనుకుంటున్నానని తన అభిప్రాయాన్ని మీడియా ద్వారా వెల్లడించారట.

‘గూఢచారి’ చిత్రానికి అడివి శేష్‌ కథను అందించారు. ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. ‘జేమ్స్‌బాండ్‌’లాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం కావడంతో ఓవర్‌సీస్‌లోనూ మంచి వసూళ్లు రాబట్టింది. అందుకే ఈ సినిమాను హిందీలో రీమేక్‌ చేయాలని కరణ్‌ సన్నాహాలు చేస్తున్నారట.