శ్రీదేవి కుమార్తె తెలుగు లాంచింగ్ ఖరారు,డిటేల్స్

ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న RRR రీసెంట్ గా మొదలైంది. మల్టిస్టారర్ గా రూపొందే ఈ సినిమాని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్స్ ఎవరై ఉంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. రకరకలా స్పెక్యులేషన్స్ బయిట నడుస్తున్నాయి. ఇప్పటికే మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ఈ సినిమాలో ఖరారు అయినట్లు వార్తలు వచ్చాయి.

అదే సమయంలో ఈ సినిమాలో స్వర్గీయ శ్రీదేవి కుమార్తె జాహ్నవి ని హీరోయిన్ గా అడుగుతున్నట్లు బాలీవుడ్ మీడియా అంటోంది. జాహ్నవి కపూర్ ఇప్పటికే హిందీలో ఓ సినిమా చేసింది. మరో సినిమాకు కరణ్ జోహర్ తో ఎగ్రిమెంట్ ఉంది. దాంతో కరణ్ జోహార్ నుంచి ఫర్మిషన్ తీసుకుని తాము తమ సినిమాలో నటింపచేయటానికి అంగీకరింపచేసినట్లు సమాచారం. ఈ మేరకు కరణ్ జోహార్ కే హింది రైట్స్ ఇచ్చేటట్లు మాటలు జరుగుతున్నట్లలు చెప్పుకుంటున్నారు.

అదే నిజమైతే జాహ్నవి కపూర్ చేసే తొలి తెలుగు సినిమా ఇదే అవుతుంది. గతంలో శ్రీదేవిని తమ బాహుబలి చిత్రంలో శివగామిగా అనుకున్నారు. అయితే అప్పట్లో రెమ్యునేషన్ ఎక్కువ అడిగిందని,మరొకటి అని కాదనుకున్నారు. ఇప్పుడు ఆమె కుమార్తెతో ముందుకు వెళ్తున్నారు రాజమౌళి. జాహ్నవిని తీసుకోవటం ద్వారా హిందీ మార్కెట్ కు కొంత మార్గం సుగమం అయ్యే అవకాసం ఉంది..

ఈ చిత్రాన్ని బాహుబలి తరహాలోనే ఎన్ని భాషల్లోకి సిద్దం చేస్తారనే టాపిక్ సైతం మొదలైంది. ఎలాగో తమిళ,మళయాళ మార్కెట్లు ఈ సినిమా కోసం సిద్దంగా ఉంటాయి. రీసెంట్ గా బాహుబలితో బాలీవుడ్ సైతం రాజమౌళి కొత్త సినిమాలపై దృష్టి పెట్టింది. దాంతో అక్కడ కూడా హిందీ వెర్షన్ రెడీ చేసి రిలీజ్ చేస్తారు. ఇక ఇంటర్నేషనల్ వెర్షన్ ఎలాగో ఉంటుంది.