దీపిక పెళ్లి: డబుల్ మీనింగ్ వచ్చేలా ‘కండోమ్’ కంపెనీ విషెష్

జరిగింది సెలబ్రెటీల పెళ్లి ..దాన్ని అడ్డం పెట్టి తమను తాము ఎలా పబ్లిసిటీ చేసుకోవాలా అని ఆలోచించేవారు ఎక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా పెద్ద పెద్ద కంపెనీలు ఫ్రీ పబ్లిసీటి ఎలా వస్తుందా అని ఎదురుచూస్తూంటాయి. తాజాగా భారతదేశం అంత‌టా అత్యంత హాట్ టాపిక్‌గా మారిన విష‌యం దీపిక, ర‌ణ్‌వీర్ వివాహం.

నవంబ‌ర్ 14న కొంక‌ణీ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగిన వీరి వివాహం నేడు సింధు సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌ర‌గ‌నుంది. ఇద్ద‌రు బాలీవుడ్ సెల‌బ్రిటీలు వివాహ బంధంతో ఒక్క‌టి కానున్నారంటే అభిమానుల‌లో ఎంత ఆస‌క్తిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

ఈ నేపధ్యంలో మూడుముళ్ల బంధంతో ఒకటైన దీపిక పడుకొనె-రణవీర్ సింగ్‌కు డ్యూరెక్స్ కండోమ్ కంపెనీ తనదైన శైలిలో వివాహ శుభాకాంక్షలు తెలియేజేసి వార్తల్లోకి ఎక్కింది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే… డ్యూరెక్స్ కండోమ్ బ్రాండ్‌కు రణవీర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఓ కండోమ్ ప్రోడక్ట్‌కు బాలీవుడ్‌లో తొలిసారి ఓ హీరో ప్రమోట్ చేయడం విశేషం. దాంతో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంది కంపెనీ.

డ్యూరెక్స్ కంపెనీ దీపిక-రణవీర్ జంటకు ఓ వైపు విషెస్ చెబుతూనే మరోవైపు తన ఉత్పత్తిని ప్రచారం చేసుకునే ప్లాన్ చేసుకుంది. …‘ఇక నుంచి మీరు అఫీషియల్‌గా రింగ్ తొడుక్కుంటారంటూ’ డబుల్ మీనింగ్ వచ్చేలా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంటే వారి ఆలోచన ఫలించినట్లే.

హై సెక్యూరిటీ మ‌ధ్య భారీ బ‌డ్జెట్‌తో డెస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌రుపుకుంటున్న దీపిక‌, ర‌ణ్‌వీర్ లు ఈ నెల 16న ఇండియాకు తిరిగి రానున్నారు. ఈ నెల 21న బెంగళూరులోని లీలా ప్యాలస్‌లో తొలిసారి, నవంబర్ 28న ముంబైలోని గ్రాండ్ హయత్‌లో మరోసారి వెడ్డింగ్ రిసెప్షన్ జ‌రుపుకోనున్న‌ట్టు తెలుస్తుంది.