అందరూ చూస్తూండగా ఆ పని చేసాడు, కేసు పెట్టారు

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ పనిమాలా వెళ్లి మరో వివాదంలో చిక్కుకున్నాడు. రీసెంట్ గా రేస్‌ 3 సినిమాతో నిరాశపరిచిన సల్మాన్‌ ప్రస్తుతం ‘భారత్‌’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఆయన పాకిస్దాన్ జెండా ఎగరేసారు. ఇప్పుడు అదే సమస్యగా మారింది. ఆ సినిమా షూటింగ్ చూడటానికి వచ్చిన ఆ ప్రాంత జనం…ఆయనపై కేసు పెట్టారు. అంతేకాకుండా షూటింగ్ ఆపు చేసుకుని పొమ్మంటున్నారు. సినిమా లో అది ఒక సీన్ మాత్రమే అని ..దాన్ని పెద్దది చేయద్దని దర్శక,నిర్మాతలు గోలెత్తినా జనం ..దేశభక్తిపై కామెడీలా అంటున్నారు.

ఈ సినిమా అలీ అబ్బాస్ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది . కత్రినా కైఫ్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌కు విడుద‌ల కాబోతోంది. ప్ర‌స్తుతం చిత్రం షూటింగ్ పంజాబ్‌లో జ‌రుగుతుంది. సినిమాకి సంబంధించి ఓ స‌న్నివేశాన్ని ఇండోపాక్ బోర్డ‌ర్‌లో చిత్రీక‌రించాల్సి ఉండ‌గా, అనుమ‌తులు లేక‌పోవ‌డంతో పంజాబ్‌లోనే సెట్ వేసి షూట్ చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంలోనే స‌ల్మాన్ పాకిస్థాన్ జెండా ఎగుర వేశాడ‌ట‌. ఈ విషయంపై చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అయితే సినిమా షూటింగ్ కోసం చేసింది కాబట్టి లీగల్‌ సమస్యలు ఎదురుకావన్న నమ్మకంతో చిత్రయూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది‌.

అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్, కత్రినా కైఫ్, దిశా పాట్నీ, జాకీ ష్రాఫ్‌ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘భారత్‌’. సౌత్‌ కొరియన్‌ మూవీ ‘ఓడ్‌ టు మై ఫాదర్‌’కి ఇది రీమేక్‌.ఇక స‌ల్మాన్ ఖాన్‌కి వివాదాలు కొత్త కాదు. ఇటీవ‌ల కృష్ణ జింక కేసులో కొన్నాళ్ళు జైలులో కూడా ఉండి వ‌చ్చాడు.