బిజెపితో వై ఎస్ ఆర్ పార్టీకి పడటం లేదా ?

బిజెపితో వై ఎస్ ఆర్ పార్టీకి పడటం లేదా ?

ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్య సభలో ఎలాగైనా గట్టెక్కించాలని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది . ఈరోజు రాజ్య సభలో ఈ బిల్లు మీద చర్చ జరిగింది . వివిధ పార్టీలు తమ తమ అభిప్రాయాలను చెబుతున్నాయి . వై .ఎస్ .ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు . ఇంతకాలం భారతీయ జనతా పార్టీ తో వై .ఎస్ .ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నిహితంగా ఉంటుందని , ప్రధాని నరేంద్ర మోడీ కనుసన్నల్లోనే జగన్ మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడననే వాదన, విజయసాయి రెడ్డి ప్రకటనతో అది కరెక్ట్ కాదని తేలిపోయింది .

ఈ వాదన వల్ల భారతీయ జనతా పార్టీ , వై .ఎస్ . ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య దూరం పెరుగుతుందని భావించవచ్చునా ? లేక ముస్లిం సమాజం కు మేము దూరం కామనే సందేశం ఇవ్వడమా ? వై . ఏస్ .ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటి ? ట్రిపుల్ తలాక్ వల్ల కాపురాలు చితికిపోతాయని , భర్త తలాక్ చెబితే ,అతన్ని మూడు సంవత్సరాలు జైలుకు పంపిస్తామని అంటున్నారు … అదే జరిగితే ఆ కుటుంబ భాద్యత ఎవరిదీ అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు . అందుచేత ఈ బిల్లును ్పున పరిశీలించాలని తాము కోరుతున్నామని చెప్పారు . సామాజిక సమస్య ను నేరపూరిత దృష్టితో చూడ వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు .