Vijay Sai Reddy: ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ మధ్యాహ్నం విజయవాడలోని సిట్ కార్యాలయానికి ఆయన హాజరై అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్లో విజయసాయి, మద్యం కుంభకోణానికి రాజ్ కసిరెడ్డి కీలక సూత్రధారి అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆయనను సిట్ సాక్షిగా విచారిస్తోంది.
అయితే, విచారణకు ముందే కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. సిట్ అధికారులు ఏప్రిల్ 18న విచారణకు హాజరుకావాలని విజయసాయికి నోటీసులు పంపారు. అయితే తనకు అప్పటికే కొన్ని పనులున్నాయని, ఒక రోజు ముందే అంటే ఏప్రిల్ 17న విచారణకు వస్తానని విజయసాయి తెలిపారు. దాంతో సిట్ కార్యాలయంలో 17వ తేదీకే ఏర్పాట్లు పూర్తి చేశారు.
అయితే, అనూహ్యంగా 17న విజయసాయి విచారణకు హాజరుకాలేదు. నిన్న సిట్ అధికారులకు సమాచారం ఇచ్చి, తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజే విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని స్పష్టంచేశారు. తన ప్రతిపాదన మేరకే సిట్ విచారణను మార్చింది. ఈ రోజు మధ్యాహ్నం ఆయన విచారణకు హాజరయ్యారు.
మద్యం స్కాంలో విచారణను వేగంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో సిట్ కీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలువురు నేతల పేర్లు బయటకొస్తుండగా, విజయసాయి చేసిన వ్యాఖ్యలు ఈ కేసులో మరింత హీట్ తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన నుంచి సిట్ కీలక సమాచారం అందుకునే అవకాశం ఉంది. విచారణ వివరాలను అధికారులు త్వరలో వెల్లడించే అవకాశముంది. మరి విజయసాయిరెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ ఈ కేసు దిశను ఎలా మలుపుతిప్పుతుందో చూడాల్సిందే.