సీఎం జగన్ సైకో నత్తి పకోడి.. వైరల్ అవుతున్న అనిత సంచలన వ్యాఖ్యలు?

టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ మేము, మా రాష్ట్రం డైలామాలో ఉన్నామని తెలిపారు. ఒకవైపు కరోనా మరోవైపు జగన్ అల్లాడిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. మేము ప్రశ్నిస్తున్నామని అందుకే మేము టార్గెట్ అవుతున్నామని అనిత తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రతిదీ సిస్టం ప్రకారం ఉండాలని భావిస్తారని అనిత కామెంట్లు చేశారు.

మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్లను మాత్రం వదిలే ప్రసక్తి లేదని ఆమె వెల్లడించారు. నాపై 11 కేసులు నమోదయ్యాయని ఆ కేసులలో ఒక కేసు అట్రాసిటీ కేసు అని అనిత అన్నారు. సీఎం జగన్ ను నేను సైకో అంటానని నత్తి పకోడి, నత్తిరెడ్డి అంటానని ఆమె తెలిపారు. జగన్ తడబడకుండా మాట్లాడాలని ఆయన భాషలో మార్పు రావాలని కోరుకుంటున్నానని అనిత చెప్పుకొచ్చారు. తల్లికి చెల్లికి గౌరవం ఇవ్వని జగన్ మనకు గౌరవం ఇస్తారని ఎలా భావించాలని ఆమె అన్నారు.

దిశ చట్టం అసలు చట్టమే కాదని ఆ చట్టానికి ఇప్పటికీ చట్టభద్రత కల్పించలేకపోయారని అనిత తెలిపారు. రోజా చంద్రబాబు గురించి అవగాహన లేకుండా మాట్లాడారని ఆమె అలా మాట్లాడటం సరికాదని అనిత చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో ఎన్టీఆర్ కూతురికే అవమానం తప్పలేదని ఆమె కామెంట్లు చేశారు. నేనైతే చాలా కసిగా ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. కుక్కకాటుకు చెప్పు దెబ్బే సరి అని అనిత వెల్లడించారు.

న్యాయవ్యవస్థపై నాకు గౌరవం ఉందని అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటామని అనిత అన్నారు. ఎవరి అకౌంట్లు ఎలా సెటిల్ చేయాలో అలా సెటిల్ చేస్తామని అనిత వెల్లడించారు. 23 సీట్లకు పడిపోయేంత దారుణాలు టీడీపీ ఏం చేసిందరని అనిత ప్రశ్నించారు. చంద్రబాబును ఇప్పటివరకు ఏదీ అడగలేదని ఆయనే అన్నీ ఇచ్చారని అనిత చెప్పుకొచ్చారు.