జర్నలిస్టు కుటుంబానికి హారీష్ రావు పరామర్శ

సిద్దిపేటలో జర్నలిస్ట్ కుటుంబాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. సిద్దిపేట ఆంధ్రజ్యోతి విలేఖరి అశోక్ భార్య ఇటివల అనారోగ్యంతో మరణించింది. విషయం తెలుసుకున్న హారీష్ రావు మంగళవారం అశోక్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను, పిల్లలను పరామర్శించి ఓదార్చారు. మీరు అదైర్య పడవద్దని అండగా ఉంటానని వారికి భరోసానిచ్చారు. పిల్లల చదువు, తదితర వివరాలు హరీష్ రావు అశోక్ ను అడిగి తెలుసుకున్నారు.