విద్యార్థులను చితకబాదిన ప్రిన్సిపల్.. కారణమేంటో తెలిస్తే ప్రిన్సిపల్ ని ఛీ కొడతారు..?

ప్రస్తుత కాలంలో అక్రమ సంబంధాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల ఇలా అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. అయితే కొంతమంది ఉపాధ్యాయులు కూడా తోటి ఉద్యోగస్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా చేయాల్సిన ఉపాధ్యాయులు ఇలా అడ్డదారులు తొక్కుతూ అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపల్ మహిళా ఉద్యోగిత అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు అతని బండారాన్ని బయటపెట్టాలని వీడియో తీశారు. దీంతో ప్రిన్సిపల్ ఆగ్రహానికి గురై విద్యార్థులను చితకబాదడంతో కటకటాల పాలయ్యాడు.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మైనార్టీ ఉర్దూ పాఠశాల ప్రిన్సిపాల్ ఆనంద్ ప్రసాద్, కంట్రాక్ట్ యుడిసి మహిళా ఉద్యోగినితో రాసలీలలు సాగిస్తున్న విషయాన్ని గమనించిన విద్యార్థులు వీరు ఏకాంతంగా కలిసి ఉన్న సమయంలో రహస్యంగా వీడియో తీశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ ఆనందప్రసాద్ తన బండారం బయటపడుతుందని భావించి వీడియో తీసిన విద్యార్థులను చితకబాదాడు. ప్రిన్సిపాల్ ఇలా రాత్రిపూట హాస్టల్ కు రావటం, వార్డెన్ లేకపోవడంతో ఇష్టరీతిగా ప్రవర్తించారని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలపటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

విద్యార్థులకు మంచి బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు ఇలా మహిళా ఉద్యోగులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా అర్థరాత్రి పూట విద్యార్థులు చూస్తున్న గానే హాస్టల్లో రాసలీలలు కొనసాగించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా నిజానికి పాల్పడిన ప్రిన్సిపల్ ని తక్షణమే విదుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం సంచలనంగా మారటంతో విద్యాశాఖలో కలకలం రేపుతోంది. ప్రిన్సిపల్ వ్యవహార తీరుపై విద్యాశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వివాదం గురించి పోలీసులతోపాటు విద్యాశాఖ అధికారులు కూడా సరైన ఆధారాలు సేకరించి పనిలో ఉన్నారు.