సీమంతం చేసుకొని వస్తుండగా రోడ్డు ప్రమాదం

శుభకార్యం ముగించుకుని కారులో ఇంటికి బయల్దేరిన ఆ కుటుంబంలో విషాదం జరిగింది. త్వరలో తల్లి కాబోతున్న కూతురికి సీమంతం జరిపించి పుట్టింటికి తీసుకెళుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లీ కూతుళ్ల తోపాటు డ్రైవర్ చికిత్స పొందుతూ మరణించాడు. అసలు వివరాలు ఏంటంటే…

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడ్లవల్లిలో జయశ్రీ కి సీమంతం జరిగింది. సీమంతం జరిగిన తర్వాత తల్లి అనసూయ, జయశ్రీ, మరో ముగ్గురు బంధువులు కలిసి జయశ్రీ పుట్టింటికి బయల్దేరారు. కారు యర్లపాడు మండలం తిమ్మాపురం దగ్గర అదుపు తప్పి ముందు ఉన్న ట్రాక్టర్ ను ఢికొట్టింది.  ఈ ప్రమాదంలో అక్కడికక్కడే జయశ్రీ, తల్లి అనసూయ మరణించారు. జిజిహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డ్రైవర్ మరణించాడు. 

మరణించిన జయశ్రీ

శుభకార్యం జరిగిన కొద్ది సేపట్లోనే తల్లి బిడ్డలు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. లోకాన్ని చూడాలనుకునన చిన్నారి, అమ్మా అన్న పిలుపు నోచుకోకుండానే జయశ్రీ, కడుపులో బిడ్డ చనిపోవడంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి.