రామోజీ మార్కు నాటకం.! సినిమాటిక్‌గా మారిన వైనం.!

మొన్నామధ్య ‘ఈనాడు’ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుని మార్గదర్శి కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ విచారించిన సంగతి తెలిసిందే. మంచమ్మీద పడుకుని, సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు రామోజీ సమాధానమిచ్చారు. అనారోగ్యం బాగాలేక మంచాన పడ్డారట రామోజీ.

దానికి సంబంధించిన ఫొటోలు అప్పట్లో పెను సంచలనమయ్యాయి. తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. ఎవరు దీన్ని లీక్ చేశారోగానీ, ‘నన్ను చంపేద్దామనుకుంటున్నారా.?’ అని రామోజీరావు, సీఐడీ అధికారుల్ని ప్రశ్నించడం ఆ వీడియోలో సెంటరాఫ్ ఎట్రాక్షన్.

సినిమాల్లోని కొన్ని సన్నివేశాల్ని, రామోజీరావు వీడియోలో జోడించారు. వెరసి, ఇదొక సినిమాటిక్ వ్యవహారమైపోయింది. ఇలాంటి వీడియోలు ఎలా బయటకు వస్తాయి.? విచారణ మొత్తాన్ని వీడియో తీసినట్లు ఏపీ సీఐడీ చెబుతోంది. అలా అయితే, వీడియో లీక్ చేసింది ఏపీ సీఐడీ నుంచేనా.? అన్నఅనుమానాలు తెరపైకొస్తున్నాయి.

ఇవేవీ కాదు, అక్కడే వున్నోళ్ళెవరో ఈ వీడియో లీక్ చేసి వుంటారా.? అన్న వాదనలూ లేకపోలేదు. ఒక్కటైతే నిజం.. వ్యవస్థల్ని శాసించగల శక్తి వున్న రామోజీరావు, ఇంత డ్రమెటిక్‌గా ఎందుకు మంచాన పడినట్లు కనిపించారు.? పైగా, ‘నన్ను చంపేయాలనుకుంటున్నారా.?’ అని ఆయన ప్రశ్నించడమేంటో.! తెలుగునాట ఈ వీడియో చర్చనీయాంశమయ్యింది. సోషల్ మీడియాలో వేలాది మంది లక్షలాది మంది ఈ వీడియోను ట్రోల్ చేస్తున్నారు.