పూన‌మ్ ఘాటు ట్వీట్‌… భుజాలు తడుముకుంటున్నారంట!

గతకొంతకాలంగా కీలక విషయాలపై, మరి ముఖ్యంగా ఏపీ రాజకీయాలకు, సినిమాలకు సంబంధించిన విషయాలపై ఆన్ లైన్ వేదికగా ఘాటుగా స్పందిస్తుంటారు నటి పూన‌మ్ కౌర్. అయితే ఆమె ట్వీట్లలో ఎవరో ఒకరిని టార్గెట్ గా చేసి వాయిస్తున్నారని తెలుస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ట్వీట్ చేశారు పూనం.

అవును… హీరోయిన్ పూన‌మ్ కౌర్ ఏ ట్వీట్ పెట్టినా తెలుగు మీడియాలో అది హైలెట్ అవుతుంటుంది. ఈ ట్వీట్స్ లోని ఆమె అభిప్రాయాలు, విమర్శలు అతనిపైనే అని ఒక వ్యక్తిని నేరుగా చూపిస్తుంటే.. మరి కొన్ని ఛానల్స్ మాత్రం… “ఎవరబ్బా” అనే సందేహాన్ని మిగల్చడానికి ప్రయత్నిస్తుంటుంది. ఈ సమయంలో పూన‌మ్ తాజా ట్వీట్ వైరల్ అవుతుంది.

“మహిళల సమస్యలపై మహాశ్రద్ధ ఉన్నట్టు గొంతు చించుకుని అరుస్తున్న వీళ్ళు.. మహిళా రెజ్లర్ల కష్టాల గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. వాళ్ల స్వలాభం, సౌకర్యాలే ప్రధానంగా ఉండే నకిలీ నాయకులతో జాగ్రత్తగా ఉండండి” అంటూ పూన‌మ్ కౌర్ ట్వీట్ చేశారు. దీనికి తోడు ఆమె “హ్యాష్‌ ట్యాగ్ ఆంధ్రప్రదేశ్” అని ప్రత్యేకంగా పేర్కొన్నారు.

దీంతో హెచ్చరిక‌తో కూడిన సలహాగా ఉన్నట్లుగా ఉన్న ఈ ట్వీట్ ఏపీ రాజ‌కీయాల‌తో ముడిప‌డిన అంశంగా పలువురు అభిప్రాయపడుతున్నారని తెలుస్తుంది. దీంతో ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో పూన‌మ్ ట్వీట్ పై ఆసక్తికర చర్చ జరుగుతుంది. “మహిళలపై మహాశ్రద్ధ ఉన్నట్లు నాటకాలాడుతున్న నకిలీ పొలిటీషియన్స్” అని ఎవరిని ఉద్దేశించి అన్నారు అని తెగ చర్చించుకుంటున్నారంట.

మరోపక్క దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహిళా రెజ్లర్ల సమస్యపై స్పందిస్తే అధికారంలో ఉన్న బీజేపీకి నష్టం కాబట్టి.. ఆ పార్టీకి ఏపీలో ఎవరు మిత్రులుగా ఉన్నారు అనే డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయని తెలుస్తుంది. దీంతో ఒక పార్టీ పేరు, దాని అధినేత పేరు తెరపైకి వస్తోందని సమాచారం. దీంతో ఆ నాయకుడి అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు ఆన్ లైన్ వేదికగా పూన‌మ్ పై ఫైరవుతున్నారని సమాచారం.

దీంతో గుమ్మడికాయల దొంగ అనగానే భూజాలు ఎందుకు తడుముకుంటున్నారంటూ మరికొంతమంది.. సదరు రాజకీయ నాయకుడి అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారని అంటున్నారు. దీంతో… ఈ ట్వీట్స్ మరింత వైరల్ అవుతున్నాయి. పైగా… ఈ ట్వీటు కాస్త ఘాటుగా ఉండటంతో… ఆ రాజకీయ నాయకుడి అభిమానులు మంటెత్తిపోతున్నారని సమాచారం.