పరకాల బూతు పాండిత్యం.! భార్యామణికి సంకటం.!

ఈయనేదో నోరు పారేసుకుంటున్నాడు. కానీ, అది ఆయనగారి సతీమణికి ఇబ్బందికరంగా మారుతుంది. రాయడానికి వీల్లేనంత దుర్గందభరితమైన పదజాలాన్ని పరకాల ప్రభాకర్ ప్రయోగిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. సినీ నటులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ మీదనే పరకాల ప్రభాకర్ ఈ ట్వీటాస్త్రాలు సంధిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ప్రజారాజ్యం నాటి ‘కసి’ ఇంకా పరకాల ప్రభాకర్‌లో పోలేదు. మెగాభిమానులు.. అందునా, పవన్ కళ్యాణ్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్, పరకాలని కూడా మర్చిపోలేరు. ఆయన్ని తూలనాడుతూనే వున్నారు.

ఎవరికో కౌంటర్ ఇచ్చే క్రమంలో పరకాల ప్రభాకర్ నానాటికీ దిగజారిపోతున్నారు. తాజాగా ఐదో డోస్.. అంటూ ‘సంక నాకుడు’ వ్యవహారంపై ట్వీట్లేశారు. కానీ, ఆయనకు అర్థం కావాల్సిన విషయమేంటంటే, ఆ ‘సంకనాకుడు’ వ్యవహారంలో ఆయన అనుభవమే బహిర్గతమవుతోందిప్పుడు. అంతే కదా, ఒకరి వైపు వేలెత్తి చూపిస్తే, మిగిలిన నాలుగు వేళ్ళూ తన వైపుకే తిరిగి వుంటాయని పరకాల ప్రభాకర్ తెలుసుకోవాలి కదా.! ఇక్కడే ఆయన బొక్క బోర్లా పడుతున్నారు. ఆత్మవిమర్శ చేసుకోలేకపోతున్నారు.

డోసుల వ్యవహారం పరకాల మానేస్తే, ఆయనకే మంచిది. ఎందుకంటే, ఆయన వేసేది రోజుకి ఒక్క ట్వీటు మాత్రమే. ఆయన్ని తూలనాడుతున్నది వేలాది మంది, లక్షలాది మంది.! పైగా, పరకాల బూతులన్నిటినీ, ఆయన సతీమణి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కి ట్యాగ్ చేస్తున్నారు నెటిజన్లు. ఆమెకెందుకీ తలనొప్పి.?