ఎన్టీఆర్ కి నివాళులర్పించిన నందమూరి కుటుంబ సభ్యులు

మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు 23 వ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. శుక్రవారం ఉదయమే ఎన్టీఆర్, కళ్యాణ్ రాములు నివాళులర్పించారు. అనంతరం నందమూరి బాలకృష్ణ, సుహాసిని తదితరులు నివాళులర్పించారు. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన స్పూర్తితో అంతా ముందుకు సాగాలని బాలకృష్ణ అన్నారు.