రాఖీ రోజు రొమాంటిక్ ట్వీట్ పెట్టిన లోకేష్

ఆంధ్ర ఐటీ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ రాఖీ పండుగ రోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ పెట్టారు. లోకేష్ రాఖీ శుభాకాంక్షలకి బదులు పెళ్లిరోజు శుభాకాంక్షలు పెట్టాడు అనుకుంటున్నారేమో కాదు.

ఈ రోజు నారా లోకేష్, బ్రాహ్మణిల పెళ్లి రోజు. వారి పెళ్లి జరిగి 11 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణికి ప్రేమతో ఒక ట్వీట్ పెట్టారు నారా లోకేష్.

పదకొండేళ్ళుగా నేను నిజంగా ప్రేమించబడుతున్నాను, విలువ ఇవ్వబడుతున్నాను, శ్రద్ధ తీసుకోబడుతున్నాను అని మేలుకుంటున్నాను. నువ్వు నా జీవితంలోకి రావటం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం. అందుకు నేను ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పెళ్లిరోజు శుభాకాంక్షలు బ్రాహ్మణి అని వారిద్దరి రొమాంటిక్ ఫోటో జత చేస్తూ ట్వీట్ పెట్టారు. ఆ ఫోటో, ట్వీట్ కింద ఉన్నాయి చూడండి.