భీమిలి కోసం లోకేష్ పేరు పరిశీలిస్తున్న చంద్రబాబు

భీమిలి నియోజకవర్గానికి మంత్రి నారా లోకేశ్‌ పేరు పరిశీలనకు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఈ రోజు అమరావతిలో  జరిగిన ఒక కీలకమయన సమీక్షా సమావేశంలో బీమ్లీ నుంచి ఐటి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి లోకేష్ ను రంగంలోకి దించితే ఎలా ఉంటుందనే అంశం మీద చర్చజరిగింది.

ఆయన కౌన్సిల్ సభ్యడుయినా, అసెంబ్లీకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కౌన్సిల్ సభ్యుడిగా ఉండటం కంటే, అసెంబ్లీ ని గెల్చి క్యాబినెట్ లో కూర్చుంటే ఆయన స్టేచర్ పెరుగుతుందని, అందువల్ల ఆయనను పోటీకి దించాలని చాలా మంది ముఖ్యమంత్రి మీద వత్తిడి తీసుకువస్తున్నారు.

ప్రస్తుతం భీమిలి నియోజకవర్గానికి మంత్రి గంటాశ్రీనివాసరావు పేరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లి, విశాఖ పార్లమెంటు స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల స్థితిగతుల మీద సమీక్ష చేపట్టారు. ఇక్కడ సిటింగ్ ఎమ్మెల్యేలతో పాటు అందుబాటులో ఉన్న అర్హలయిన అభ్యర్థుల పేర్లు పరశీలనకు వచ్చాయి. అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాలలో సిట్టింగ్‌లతో పాటు కొత్తవారి పేర్లు పరిశీలించారని తెలిసింది. ఒక వేళ లోకేశ్ పేరును భీమిలికి ఖరారు చేయాల్సి వస్తే మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ నార్త్ కు పంపే అవకాశం ఉంది.

నిజానికి లోకేశ్ పేరు చాలా చోట్ల వినిపించింది. తాజా గా కర్నూలు సీటు వివాదంలో కూడా ఆయన పేరు ప్రస్తావన కవచ్చింది. కర్నూలు సీటు కోసం సిటింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి (వైసిపి నుంచి ఫిరాయించిన వ్యక్తి) మళ్లీ పోటీచేయాలనుకుంటున్నారు. అయితే, ఆ సీటు తన కుమారుడు భరత్ ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేశ్ పోటీ పడుతున్నారు.

ఈ నేపథ్యంలో తాను కర్నూలు సీటు వదలుకునేది లేదని, లోకేశ్ గనక పోటీ చేస్తే తాను వదలుకుంటానని ఎస్వీ మోహన్ రెడ్డి ప్రకటించారు.

అయితే, చంద్రబాబు నాయుడు రాయలసీమలోని కుప్పం నుంచి పోటీ చేస్తున్నందున నారా లోకేష్ ను కోస్తానుంచి మాత్రమే పోటీ చేయించాలని అధినేత భావిస్తున్నారు. అందునా రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖ పరిసరాలనుంచి పోటీ చేస్తే విశాఖ మీద ఆయన కంట్రోలులో ఉంటుందని, దీనికి సురక్షితమయిన స్థానం భీమిలి అని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.