పవన్ కళ్యాణ్ కి లోకేష్ సవాల్: సంచలన ట్వీట్స్

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి తనయుడు, ఏపీ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు. మరోసారి ఆయన ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈమధ్య లోకేష్ దూకుడు పెంచారు. అప్పోజిషన్ పార్టీలపై ట్విట్టర్ వేదికగా విమర్శల దాడి చేస్తున్నారు. జగన్ పై దాడి ఘటనలో “జగన్ మోడీ రెడ్డి కోడి కత్తి డ్రామా” అంటూ ఆయన చేసిన ట్వీట్స్ సంచలనం సృష్టించాయి. సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు జగన్ మోడీ రెడ్డి అంటూ జగన్ కి లోకేష్ పెట్టిన పేరును తెగ వైరల్ చేశారు.

ఈసారి ఆయన ట్వీట్స్ పవన్ పైకి మళ్లించారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ బాక్సయిట్ తవ్వకాల గురించి పలు ట్వీట్లు పెట్టారు. లేటరైట్స్ పేరుతో బాక్సైట్ అక్రమ మైనింగ్ జరుగుతుంది. దీని వలన పర్యావరణానికి నష్టం వాటిల్లుతుంది. ఈ ఇల్లీగల్ మైనింగ్ అడ్డుకునేబదులు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ విషయంపై ప్రతిపక్ష నాయకుడు నోరు మెదపరేంటి? ఆయన దీనికి మద్దతా లేక వ్యతిరేకా? అంటూ ట్వీట్ చేశారు. జనసేన పార్టీ బాక్సయిట్ అక్రమ మైనింగ్ కు వ్యతిరేకం అంటూ ఒక వీడియో కూడా పెట్టారు. ఆ వీడియో కింద చూడవచ్చు.

పవన్ కళ్యాణ్ ట్వీట్స్ పై స్పందిస్తూ లోకేష్ ఆయనకొక సవాల్ విసిరారు.”మోడీ దత్తపుత్రుడి అబద్దపు ప్రచారం. అవినీతి అంటూ గగ్గోలు పెట్టారు. నిరూపించమంటే ప్యాకప్ అన్నారు. ఇప్పుడు మరోసారి బాక్సయిట్ మసి పూసే ప్రయత్నం చేస్తున్నారు. “పదవి కోసం తప్పుడు ప్రచారం మాని ఆధారాలు ఉంటే బయటపెట్టమని సవాల్ చేస్తున్నా”. మోడీ ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసారంటూ మీరు ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్టు ఇచ్చినా ఎందుకు ప్రశ్నించడం లేదు? ఆ రిపోర్ట్ ఎక్కడ దాచారు అంటూ ట్విట్టర్ ద్వారా పవన్ ని నిలదీశారు లోకేష్.