కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఇక లేరు
కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి ఆదివారం ఉదయం కన్నుమూశారు ఆయన వయసు 77 సంవత్సరాలు . జైపాల్ రెడ్డికి భార్య ఇద్దరు కుమారులు ఒక కుమార్తె వున్నారు . కొన్నిరోజులుగా ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆసుపత్రిలో చేర్పించారు . ఆదివారం తెల్లవారు జామున 1. 28 నిముషాలకు తుది శ్వాస విడిచారు . 16 జనవరి 1942లో తెలంగాణలోని నిర్మట్ట లో జన్మిచారు . పుట్టుకతో అంగవైకల్యం వున్నా గుండె ధైర్యంతో , ఆత్మ విస్వాసంతో అడుగులు ముందుకేసి ఎందరికో ఆదర్శంగా నిలిచినా గొప్ప పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి .
జైపాల్ రెడ్డి కి 18 నెలల వయసులోనే పోలియో తో కాళ్ళు నడవలేని స్థితి వచ్చింది . చిన్నప్పటి నుంచి చేతి కర్రల సహాయంతోనే నడవడం ప్రారంభించారు . ఉస్మానియాయా విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మె చదివిన జైపాల్ రెడ్డికి వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. అలాగే ఎక్కువ పుస్తకాలు , వార్తాపత్రికలు చదివేవారు . ఆ చదువే ఆయన్ని రాజకీయ రంగం వైపు మళ్లించింది . విద్యార్థి దశలోనే ఆయనలో నాయకత్వ లక్షణాలు ఉండేవి . అనర్గలంగా మాట్లాడేవాడు . 1969లో మొదటిసారి కల్వకుర్తి నుంచి శాసన సభకు ఎన్నికయ్యారు . నాలుగుసార్లు శాసన సభకు ఎన్నికైన జైపాల్ రెడ్డి అసెంబ్లీ లో చేసిన ప్రసంగాలు ఎందరికో స్ఫూర్తి నిచ్చాయి.
కాంగ్రెస్ పార్టీలో వున్న జైపాల్ రెడ్డి 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించడంతో 1977లో జనతా పార్టీలో చేరారు .
ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ నుంచి పార్లమెంట్ సభ్యుడుగా ఇందిరాగాంధీ మీద పోటీ చేసి ఓడిపోయారు . 1985 నుంచి 88 వరకు జనతా పార్టీలో కార్యదర్శిగా సేవలు అందించారు . ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు . జైపాల్ రెడ్డి ఐదు పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడుగా , రెండు సార్లు రాజ్య సభ్యుడిగా ఎన్నికయ్యారు . కేంద్ర మంత్రిగా ఆయన పనిచేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు . కాంగ్రీ పార్టీలో వున్న అతి కొద్దిమంది గొప్ప నాయకుల్లో జైపాల్ రెడ్డి ఒకరు . ఆయన మృతితో తెలంగాణ ఓ గొప్ప రాజకీయ నాయకుణ్ణి కోల్పోయింది .
