టిడిపి పేరం గ్రూపు వారికి బిగ్ షాక్

విశాఖలో ఉదయం నుంచి ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. పేరం గ్రూపు ఆస్తులపై ఐటి అధికారుల సోదాలు జరుగుతున్నాయి. పేరం గ్రూపు అధినేత గురజాల హరిబాబు టిడిపి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ కు వియ్యంకుడు. సోమవారం గుంటూరు టిడిపి అధినేత, ఎల్ వీఆర్ క్లబ్ కార్యదర్శి ఇంట్లో సోదాలు జరిపిన అధికారులు నేడు విశాఖలో సోదాలు జరుపుతున్నారు.

తొలుత వ్యాపార సంస్థలపై దాడులు చేసిన అధికారులు, రెండో విడతలో టీడీపీ మద్దతుదారులు, వారి వ్యాపారసంస్థలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది.