బిజెపి నేత బద్దం బాల్ రెడ్డి కన్నుమూత

బిజెపి సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో బంజారహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన  శనివారం మద్యాహ్నాం మరణించారు. బాల్ రెడ్డి వయస్సు 73 సంవత్సరాలు. కొంత కాలంగా ఆయన పేగు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. దీంతో ఈ నెల 10న ఆస్పత్రిలో చేరారు. 

ఆయన కార్వాన్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బాల్ రెడ్డి మృతితో బిజెపి నాయకులు కేర్ ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి. పలువురు నాయకులు, ప్రముఖులు బాల్ రెడ్డి మృతికి సంతాపం తెలిపారు. ప్రజలల్లో బాల్ రెడ్డి అంటే మంచి పేరుందని, ఆయన పేద ప్రజల కోసం పని చేసిన గొప్ప వ్యక్తని బిజెపి నేతలు అన్నారు.