అయ్యో పాపం అచ్చెన్నాయుడు.! ఎందుకు బలైపోతున్నాడు.?

కొన్నాళ్ళ క్రితం ‘కొబ్బరి చట్నీ’ లీక్ ద్వారా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అడ్డంగా బుక్కయిపోయిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ విషయంలో అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది ఆ లీకు సారాంశం. ‘టీడీపీ పనైపోయింది..’ అంటూ తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా అచ్చెన్న చేసినట్లుగా ఓ ఆడియో మరియు వీడియో క్లిప్ బయటకు వచ్చింది.

తాజాగా, నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర విషయంలోనూ, అచ్చెన్నాయుడిదిగా చెప్పబడుతున్న ఓ ఆడియో లీక్ అయ్యింది. టీడీపీలో చాలామంది ముఖ్య నాయకులు మాట్లాడుకునే మాటలే అవి. ‘యువగళం పాదయాత్ర’ అట్టర్ ఫ్లాప్ అన్న చర్చ టీడీపీలో జరుగుతోంది. ఆ విషయాన్నే అచ్చెన్నాయుడు కూడా మాట్లాడి వుండొచ్చు.

లేదంటే, ఇదంతా రాజకీయ కుట్రే అయి వుండొచ్చు. ఏదైనాగానీ, అచ్చెన్నాయుడి పేరే ఎందుకు ప్రతిసారీ ఇలా వివాదాస్పదమవుతోంది.? ఈ విషయమై అచ్చెన్న కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. టీడీపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాడు. ఆ మధ్య ఈఎస్ఐ మెడికల్ స్కామ్ వ్యవహారంలో అరెస్టయ్యాక.. అచ్చెన్నాయుడి పేరు మరింత మార్మోగిపోయింది. ఆ తర్వాతే ఆయనకు పార్టీలో ప్రాధాన్యత మరింత పెరిగింది.

ఏం లాభం.? ఇది గిట్టనోళ్ళు పనిగట్టుకుని అచ్చెన్న పేరుతో లీకులు బయటకు వదులుతున్నారు. జగన్ మీద ఎంత గింజుకుని అచ్చెన్న ఆరోపణలు చేసినా, తెలుగు తమ్ముళ్ళే ఫాపం.. అచ్చెన్నాయుడిని నమ్మడంలేదాయె.!