ఏపీ బడ్జెట్ లో ఆరు కొత్త పథకాలు ప్రకటన

ఏపీ బడ్జెట్ లో ఆరు కొత్త పథకాలను ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఉన్న పలు పథకాలకు నిధులు కేటాయించి పెంచుతూనే మరి కొన్ని కొత్త పథకాలు ప్రకటించారు. ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసన సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రూ.2,26,177.53 కోట్లతో బడ్జెట్ ను రూపొందించారు.

బడ్జెట్ లో ప్రవేశ పెట్టిన ఆరు కొత్త పథకాలు ఇవే

  • అన్నదాత సుఖీభవ – రూ. 5వేల కోట్లు
  • క్షత్రియ కార్పొరేషన్ – రూ. 50 కోట్లు
  • గృహ నిర్మాణాలకు భూసేకరణ – రూ. 500 కోట్లు
  • ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం – రూ. 400 కోట్లు
  • డ్రైవర్ల సాధికార సంస్థ – రూ. 150 కోట్లు
  • మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన – రూ. 100 కోట్లు