ఏపీ సెట్స్ పరీక్షల తేదీల ప్రకటన, ఈ నెల 15 న డిఎస్సీ మెరిట్ లిస్టు ప్రకటన

ఏపీలో పరీక్షల ఫీవర్ ప్రారంభమైంది. మరో నెల రోజుల్లో టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన పరీక్ష తేదిల వివరాలను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అదే విధంగా ఈ నెల 15 న డిఎస్సీ మెరిట్ లిస్ట్ పెడుతామన్నారు. మెరిట్ లిస్ట్ ఆధారంగా నియామకాలు చేపడుతామని తెలిపారు.

మార్చి 18 నుంచి ఏప్రిల్ రెండు వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2838 పరీక్ష కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 6,21,623 మంది విద్యార్దులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఏప్రిల్ 27న పదో తరగతి పరీక్ష ఫలితాలు ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ పరీక్షలకు 10,17,600 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 1,430 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 12న ఇంటర్ ఫలితాలు  విడుదల కానున్నాయి.

వివిధ సెట్ లకు సంబంధించిన ప్రవేశ పరీక్ష తేదిలు, ఫలితాల వివరాలు

ఏప్రిల్ 19న ఏపీ ఈసెట్, మే 30న ఫలితాలు

ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఏపీ ఎంసెట్, మే 1న ఫలితాలు

ఏప్రిల్ 26న ఏపీ ఐసెట్, మే 3న ఫలితాలు

మే 1 నుంచి 4 వరకు ఏపీ పీజీసెట్, మే 11న ఫలితాలు

మే ఆరున ఏపీ ఎడ్ సెట్, మే 10న ఫలితాలు

మే ఆరున ఏపీ లా సెట్, మే 13న ఫలితాలు

మే 6-15 వరకు ఏపీ పీఈ సెట్, మే 25న ఫలితాలు విడుదల చేయనున్నారు.