కరీంనగర్ లో కలకలం.. ఐదుగురు టెన్త్ క్లాసు అమ్మాయిల మిస్సింగ్

కరీంనగర్ జిల్లాలోని కేశవపట్నం మండలకేంద్రంలో గల కస్తూరిబా పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. వీరంతా పదో తరగతి చదువుతున్నారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి వీరు కనబడకుండా పోయారు. మన్నంపల్లి గ్రామానికి చెందిన దుర్గం ఐశ్వర్య(16), తాడికల్‌కు చెందిన కొంకటి రేణుక(15), కరీంపేటకు చెందిన బెజ్జంకి భవాని(16), మంద వెవన్య(15), కాచాపూర్‌కు చెందిన మాతంగి తేజశ్రీ(16). వీరంతా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షలు దగ్గర పడుతుండడంతో భయంతో పారిపోయారా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థుల ఆచూకీ తెలిసినవారు కేశవపట్నం ఎస్‌ఐ సెల్‌నెంబర్-9440900980, హుజూరాబాద్ రూరల్ సీఐ- 9440795151 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాల్సిందిగా పోలీసులు తెలిపారు.