30 ఇయర్స్ పృథ్వీ ఇప్పుడు ఏం చేస్తురో తెలుసా?

#క‌రోనా: ఆఫీస్ అద్దె కోసం కొట్టుకుంటున్న ఆర్టిస్టులు!

టాలీవుడ్ కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ‌ ఏమైపోయారు, ఎక్కడున్నారు? తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయనను దూరం పెట్టిందా? ఆయన చేసిన ఓ చిన్న తప్పిదానికి రాజకీయ భవిష్యత్తు కూడా ముగిసిపోయిందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో కాలంగా ఉన్నా.. థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ‌ సీన్‌తో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చిన కమెడియన్ పృథ్వీ. వరుస పెట్టి మంచి అవకాశాలను అందుకుంటూ టాప్ కమెడియన్ స్థాయికి చేరుకున్నాడు. అయితే అనూహ్యంగా గత సాధారణ ఎన్నకల సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వైసీపీ తరపున ప్రచారంలోకి దిగి టీడీపీ, జనసేనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. పవన్ కళ్యాణ్‌ మీద వ్యక్తిగత వ్యాఖ్యలు చేసి మెగా అభిమానుల ఆగ్రహాన్ని చవిచూశారు. అయితే ఆయన పడ్డ కష్టానికి అదురైన గౌరవమే దక్కింది. సీఎం జగన్ పిలిచి మరీ ఎస్వీబీసీ ఛైర్మెన్ పదవి కట్టబెట్టారు.

అయితే పదవి దక్కింది అని అనుకునేలోపే.. ‘వెనకనుండి వాటేసుకోవాలనిపించింది’ అంటూ విడుదలైన ఆడియో పృథ్వీ పదవిని పోగొట్టింది. మరోవైపు ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలతో మోగా ఫ్యామిలీతో పాటు టోటల్‌గా సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయనను దూరం పెట్టేసినట్లు ప్రచారం సాగింది. అయినా పృథ్వీ ఎక్కడా తగ్గలేదు.. తనను ఇరికించిన వారి సంగతి తేలుస్తా అంటూ.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా ఎక్కడా కనిపించక సైలెంట్ అయిపోయారు.