శ్రీకాకుళం జిల్లాలో పడవ బోల్తా, ఐదుగురి గల్లంతు

తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంక పడవ బోల్లా ఘటన మరువకముందే శ్రీకాకుళం జిల్లాలో మరో పడవ బోల్తా పడింది. సంతబొమ్మాలి మండలం ఉమిలాడ సముద్ర తీరంలో 8మంది మత్స్యకారులతో వెళ్తున్న నాటు పడవ బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న ఎనిమిది మంది సముద్రంలో పడిపోగా ముగ్గురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిని మసీన్, బర్రి తాతయ్య, మైలపల్లి శ్రీను, నరసింహ, ధర్మారావులుగా గుర్తించారు. పడవ బోల్లా ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గల్లంతైన వారు విజయనగరం జిల్లా భోగాపురం మండలం కసిమికోట, చింతపల్లి గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. పడవ ప్రమాదంపై విజయనగరం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.