కడుపు చించుకున్న పృథ్వి… సంచలన వ్యాఖ్యలు

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవి కోల్పోయిన తర్వాత మీడియా ముందుకు రావడమే మానేసిన ఈ కమెడిన్ ఇప్పుడు ఏపీ రాజకీయాలను టార్గెట్ చేసే కామెంట్స్ చేసినట్లున్నాడు.

ఇంతకీ పృథ్వీ ఏం అన్నాడంటే.. ‘మన అని ఎవరినీ నమ్మెద్దు. ఇది తాతలనాటి యుగంకాదు. కల్తీ నాకొడుకులు ఏలుతున్న కలియుగం. మన ముందు మన మాట.. వాళ్ల ముందు వాళ్ల మాట మాట్లాడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండన్నా’ అంటూ పృథ్వీ తన కడుపులో దాచుకున్నవి చెప్పేశారు.

అయితే పృథ్వీ ఇవి ఎవరిని ఉద్దేశించి అన్నాడు అంటే… చాలా మంది ఇది జగన్‌ను ఉద్దేశించే అని ఉండవచ్చు అని కొందరు చర్చించుకుంటుంటే.. మరి కొందరేమో.. ఆయన అనుభవాలను ఇలా అందరికీ పంచాలని చేస్తున్నాడేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు.

అసలు పృథ్వీ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడో గానీ.. ఏపీ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.