43 రోజులగా ఆంధ్ర ప్రజానీకం ఎదురుచూసిన రోజు వచ్చింది. హోరా హోరీగా జరిగిన ఎన్నికల ఫలితాలు మరికొద్ది నిముషాల్లో వెల్లడవబోతున్నాయి.
వైస్సార్సీపీ వర్గాలు ఈ సారి గురి తప్పం అనే నమ్మకంతో ఉండగా తెలుగుదేశం వర్గాలు ఈ సారి కూడా మనమే వస్తున్నాం అని ధీమాతో వున్నాయి.
ఎన్నికలు ముగిసినప్పటి నుండి ఇద్దరు నాయకులు వైఖరి చాలా బిన్నంగా కనిపించింది. జగన్ ఈ నలభై రోజులు ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు. రెండు విదేశీ పర్యటనలు చేసి నిన్నటి రోజే తన మకాం హైదరాబాద్ నుండి రాజధానికి మార్చారు.
మరో వైపు చంద్ర బాబు ఈ నలభై రోజులు నానారకాల హడావిడి చేసారు. అనేకసార్లు ఢిల్లీ వెళ్లారు,అనేక పార్టీలని కలిశారు. EVM ల మీద ఆరోపణలు చేసారు. ఎలక్షన్ కమిషన్ తో దాదాపుగా నేరుగా గొడవ పెట్టుకున్నారు. అయినా కూడా మేమె గెలుస్తున్నాం అని చెబుతున్నారు.
ఇవన్నీ ఇలా ఉండగా సామాన్య జనం మాత్రం నలభై ఏళ్ళ అనుభవమా లేక నలభై ఏళ్ళ యువకుడు విజయం సాధిస్తారా అని ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. మరో కొన్ని గంటల్లో ఇది తేలబోతున్నది
