మిషన్ ఎడ్యుకేషన్ హెడ్ గా వసుని అడ్డుకునే ప్రయత్నంలో దేవయాని… దేవయాని కుట్ర ఫలిస్తుందా?

కాలేజ్,కుటుంబ కథ నేపథ్యంలో బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచిఆదరణ సంపాదించుకున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు మరింత ఆదరణ పెరుగుతుంది.నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే వసుధారా రిషి ఇద్దరు ఆకాశాన్ని చూస్తూ మాట్లాడుతూ ఉంటారు. చీకటిలో ఆకాశం చాలా బాగుంటుంది కదాసార్ అంటూ వసుధార అడగగా బాగుండదు అద్భుతంగా ఉంటుంది అని వీరిద్దరూ కూడా జీవితం గురించి ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుంటారు.

ఇక మరుసటి రోజు కాలేజ్ స్టాప్ తో కలిసి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్గా వసుధారణ నియమించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే జగతి ఒక వీడియో ద్వారా తాను మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతూ వసూను తన స్థానంలో నియమిస్తున్నానని తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డిబిఎస్ టి కాలేజ్ ఎండి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ వీడియోని పంపించింది.ఇక ఈ విషయం గురించి అందరి అభిప్రాయాలు తెలియజేయాలని రిషి కాలేజ్ స్టాప్ తో చెప్పగా స్టాఫ్ మొత్తం మాట్లాడుకుంటూ ఉంటారు.

అంతలోనే మినిస్టర్ రిషికి ఫోన్ చేసి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కు వసుధారని హెడ్గా నియమించడం మనకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు.అయితే రేపు పొద్దున ఎవరైనా వసుధారను నియమించడం సరైనది కాదు అని ప్రశ్నించకూడదు అందుకే అందరి అభిప్రాయం మేరకు వసుధారను మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ గా నియమించడం మంచిదని చెబుతారు. ఇక రిషి ఫోన్ మాట్లాడగానే మహేంద్ర ఏం జరిగిందని చెప్పడంతో మినిస్టర్ చెప్పినది మొత్తం రిషి వారికి చెబుతారు.

ఈ క్రమంలోనే కాలేజీ స్టాప్ దేవయానికి ఫోన్ చేసి మేడం మీరు చెప్పినట్టుగానే మినిస్టర్ గారికి వసుధార మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ అవ్వడం పట్ల మాకు అభ్యంతరాలు ఉన్నాయంటూ మెయిల్ చేశామని చెబుతారు.ఈ విషయం విన్నటువంటి వసుధార షాక్ అయ్యి ఇదే విషయాన్ని మహేంద్రకు వెళ్లి చెబుతుంది. మహేంద్ర ఎంతో కోపం తెచ్చుకుంటాడు. ఇది మనకు ఒక విధంగా దేవయాని మేడం పెట్టిన అగ్నిపరీక్ష ఎలాగైనా ఈ అగ్ని పరీక్షలో గెలవాలనీ వసు అంటుంది.

ఈ క్రమంలోనే రిషి కంగారుగా ఆలోచిస్తూ ఉండగా నేను ఈ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుకి హెడ్ గా ఉండలేను అని చెప్పడంతో ఏమైంది వసుధార అంటూ రిషి ప్రశ్నిస్తారు. ఇదంతా దేవయాని మేడం కుట్రని మీకు ఎలా చెప్పాలి సార్ అని మనసులో అనుకుంటుంది. లేదు వసుధార ఓటింగ్ పద్ధతి ద్వారా నిన్ను ఎన్నుకుంటాము అని రిషి చెపుతాడు. దీంతో మొదటగా ఫణీంద్ర వెళ్లి వసుధారకు ఓటు వేయగా మరొక లెక్చరర్ వెళ్లి నో అని ఓటు వేస్తుంది. దీంతో అందరూ కంగారు పడుతుంటారు మరి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ గా వసు గెలుస్తుందా లేకపోతే దేవయానికి కుట్ర ఫలిస్తుందా తెలియాలంటే మరొక ఎపిసోడ్ వరకు వేచి చూడాలి.