మొదటగా మంచు వారితో స్టార్ట్ చేసిన బాలయ్య.?

నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా ఓ ఓటిటి షో చెయ్యడం అనేది ఎవరూ ఊహించనటువంటిది. అలాంటి నిర్ణయం బాలయ్య తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. తెలుగు ఓటిటి సంస్థ ‘ఆహా’ వాళ్ళ కోసం బాలయ్య మొట్ట మొదటి సారిగా ఈ నిర్ణయం తీసుకోవడం నందమూరి అభిమానుల్లో మరింత ఆసక్తి రేపింది.

అలాగే ఈ షో లో ఎవరెవరు గెస్టులుగా వస్తారు అసలు బాలయ్య ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేదే అందరికీ ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న సమాచారం ప్రకారం మంచు వారి ఫ్యామిలీ తోనే మొట్ట మొదటగా బాలయ్య స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.

రీసెంట్ గానే మా ఎన్నికల కోసం బాలయ్య వారికి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇది. కానీ పొలిటికల్ గా మాత్రం వీరు వేరే.. మొత్తంగా మాత్రం ఇక ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి. అలాగే ఈ షో ప్రీమియర్స్ ఈ నవంబర్ 4 నుంచి స్టార్ట్ కానున్నట్టు తెలుస్తుంది.