క‌లెక్ష‌న్‌కింగ్ మంచు మోహ‌న్ బాబు బాంబ్ పేలుస్తార‌ట‌.. గుండెల‌దిరేలా.. ఏంటది?

మంచు మోహన్ బాబు గొప్ప విల‌క్ష‌ణ‌నటుడు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. క‌లెక్ష‌న్ కింగ్ గా ఇంతింతై ఎదిగారు. కెరీర్ పీక్స్ లో ఉండ‌గానే లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌లో అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలను కూడా నిర్మించారు. కానీ ఇన్నేళ్ల‌లో ఇంతకు ముందు ఎప్పుడూ ఒక‌ సినిమాకి దర్శకత్వం వహించడానికి ఆయ‌న ప్రయత్నించిందేమీలేదు. కానీ తాజా స‌న్నివేశం చూస్తుంటే ఆయ‌న మెగా ఫోన్ చేప‌ట్టే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌నే అర్థ‌మ‌వుతోంది. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించడానికి మోహన్ బాబు ఆసక్తిని కనబరుస్తున్నారు.

ప్రస్తుతానికి కాన్సెప్ట్ లేదా జానర్ ఏది? అన్న‌దానిపై అస్పష్టంగా ఉన్నప్పటికీ దర్శకత్వం కోసం చాలా కృషి చేస్తున్నారని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.  నటుడు-నిర్మాత స్టార్ హీరోలతో అలాగే ప్రముఖ రచయితలతో చర్చలు జరుపుతున్నారు. తాజా స‌మాచారం ప్రకారం, మోహన్ బాబు త్వరలో దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. అంతేకాదు.. ఇండ‌స్ట్రీలో ఇదో సంచలన వార్త కాబోతోంద‌ని భావిస్తున్నారు.

2018 లో మహానటిలో ఎస్.వి.రంగ రావుగా అతిథి పాత్రలో కనిపించారు మోహ‌న్ బాబు. ప్ర‌స్తుతం రిలీజ్ కి రెడీ అవుతున్న‌ సూర్య `సూరరావు పొట్రూ` (తెలుగులో ఆకాశ‌మే హద్దురా) లో కూడా అతను కీలక పాత్రలో కనిపించాడు. మోహన్ బాబు స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా తన కొత్త చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. డైరెక్ష‌న్ డెబ్యూకి సంబంధించిన అతిపెద్ద ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది.