శ్రీ‌దేవి ఆ ఎనిమిది నెల‌లు మాట్లాడ‌లేదంటే!?

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి నిర్మాత బోనీక‌పూర్ ని ప్రేమించి పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట‌కు జాన్వీక‌పూర్, ఖుషీ క‌పూర్ సంతానం. ఆ ఇద్ద‌రిలో జాన్వీ ప్ర‌స్తుతం ప‌రిశ్ర‌మ‌లో నాయిక‌గా ఎదిగేస్తోంది. ఖుషీ త్వ‌ర‌లోనే క‌థానాయిక‌గా ప‌రిచ‌యం కానుంది. ఇక బోనీక‌పూర్ మొద‌టి భార్య కుమారుడు అర్జున్ క‌పూర్ హీరోగా రాణిస్తున్నాడు. అర్జున్ సోద‌రి మాత్రం ఇంటికే ప‌రిమిత‌మైంది. అయితే దుబాయ్ లో శ్రీ‌దేవి అనుమానాస్ప‌ద మృతిపై ఇప్ప‌టికీ డౌట్స్ వ్య‌క్త‌మ‌వుతుంటాయి. ముఖ్యంగా బోనీ మొద‌టి భార్య‌.. ఆమె కుమారుడు అర్జున్ క‌పూర్ పై శ్రీ‌దేవి అభిమానుల్లో సందేహాలున్నాయి.

ఇక‌పోతే బోనీతో శ్రీ‌దేవి ప్రేమ వ్య‌వ‌హారంలో చాలామందికి తెలీని ఓ సీక్రెట్ తెలిసింది. నిజానికి శ్రీ‌దేవి అప్ప‌ట్లో బోనీతో ఎనిమిది నెల‌ల పాటు మాట్లాడ‌డ‌మే మానేసింద‌ట‌. అయితే అది ఆ ఇద్ద‌రి పెళ్లికి ముందు. బోనీ నిండా ప్రేమ‌లో మునిగి వ‌న్ సైడ్ ల‌వ‌ర్ గా ఉన్న‌ప్పుడు అలా జ‌రిగింది. బోనీ సోద‌రుడు అనీల్ క‌పూర్ స‌ర‌స‌న శ్రీ‌ద‌వి మిస్ట‌ర్ ఇండియా అనే చిత్రంలో న‌టించారు. ఆ సినిమాకి బోనీక‌పూర్ నిర్మాత‌. ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే ఓ విహార యాత్ర‌కు శ్రీ‌దేవి ఒంట‌రిగా వెళ్లాల్సి వ‌చ్చింది. ఆమె త‌ల్లికి అనారోగ్యం వ‌ల్ల అటెండ్ కాలేక‌పోయింది. దాంతో బోనీ దానిని అడ్వాంటేజ్ తీసుకున్నారు. శ్రీ‌దేవి తో విహార యాత్ర ముగిసిన అనంత‌రం ఆమె త‌ల్లి ముందే త‌న‌కు ప్ర‌పోజ్ చేశాడు. త‌న‌ని పెళ్లాడేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పాడు. దానిని శ్రీ‌దేవి వ్య‌తిరేకించింది. ఆమె త‌ల్లి కూడా తీవ్రంగా వ్య‌తిరేకించ‌డ‌మేగాక బోనీపై ఫైర‌య్యారు. అయినా బోనీ ల‌వ్ స్థిరంగానే ఉంది.

ఆ ల‌వ్ ప్ర‌పోజ‌ల్ వ్య‌వ‌హారం త‌ర్వాత ఎనిమిది నెల‌లు శ్రీ‌దేవి త‌న‌తో మాట్లాడ‌నే లేద‌ట‌. అయినా బోనీ మాత్రం ఇంకా త‌న‌నే ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ త‌ర్వాత విధి వ‌క్రించిన క్ర‌మంలోనే బోనీని శ్రీ‌దేవి పెళ్లాడాల్సి వ‌చ్చింది. ఇక శ్రీ‌దేవి బాబాయ్ చెప్పిన ప్ర‌కారం.. శ్రీ‌దేవికి ఆస్తి గొడ‌వ‌లు పెద్ద త‌ల‌నొప్పులు అయ్యాయి. ఆ క్ర‌మంలోనే అప్ప‌టికే పెళ్ల‌యిన‌వాడు అయినా బోనీకి అంకితం కావాల్సి వ‌చ్చింద‌న్న‌మాట‌.