నిఖిల్ ‘గోవా భాగోతం’ మొత్తం రిలీజ్ చేస్తాడట

హీరో నిఖిల్ సోమవారం లోపు క్షమాపణ చెప్పాలని లేకపోతే ఆందోళన తీవ్ర తరం చేయడమే కాకుండా నిఖిల్ బండారం బయట పెడతానని నిర్మాత నట్టికుమార్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే . నిఖిల్ ఆ మాటలకు స్పందించలేదు. సైలెంట్ అయ్యిపోయారు. కావాలనే నిఖిల్ సైలెంట్ అయ్యారా ..లేక నట్టికుమార్ బెదిరించినట్లుగా బండారం బయిటపడుతుందని భయపడ్డారా…ఇంతకీ ఆ బండారం ఏమిటి అనేది మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

నిఖిల్ నా సినిమాకు తీరని నష్టం చేశాడని , ఇంకా ఎక్కువ మాట్లాడితే నిఖిల్ గోవాలో చేసే భాగోతం ఫొటోలు తన దగ్గర ఉందని వాటిని రిలీజ్ చేయాల్సి వస్తుందని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు నిర్మాత నట్టికుమార్ . ముద్ర అనే టైటిల్ తో నట్టికుమార్ కు హీరో నిఖిల్ కు గొడవ జరుగుతున్న విషయం తెలిసిందే . అయితే ఆ విషయంలో నిఖిల్ కాస్త అగ్రెసివ్ గా వెళ్లడంతో గోవా వ్యవహారాలని లీక్ చేయాల్సి వస్తుందని హెచ్చరించాడు. మరి ఈ రోజు క్షమాపణ చెప్తారా…లేక నట్టికుమార్ ఆ ఫొటోలు బయిటపెడతారో చూడాలి.

అలాగే నిఖిల్ వల్ల ఎంతో మంది నిర్మాతలు నాశనం అయిపోయారని నట్టికుమార్ ఆరోపించారు. ‘నీ వల్ల ఎంత మంది నిర్మాతలు నాశనం అయిపోయారు. సర్వనాశనం అయిపోయారు. ఈరోజు నువ్వు ఈ సినిమా చేయడం వల్ల నీ నిర్మాతకు నష్టమే.. ఈ వివాదం వల్ల మాకూ నష్టమే. నీ నిర్మాతను నాశనం చేశావ్.. మమ్మల్ని నాశనం చేశావ్. ఒక హీరో చెప్పే మాటలు ప్రజల్లోకి వెళ్లిపోతాయి.

అలాగే నువ్వు చెప్పి మాటలు ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయాయి. అలా వెళ్లి మా సినిమా నాశనం అయిపోయింది. ఐదారేళ్లు ఆగిపోయిన సినిమా ఇది. నానా కష్టాలు పడి విడుదల చేస్తే.. ఆ సినిమాను నువ్వు ఆపాలని ప్రయత్నం చేస్తున్నాం. అంటే నీది కుర్రతనమా..? తాగిన మైకమా..? ఏ మైకంతో చేశావు నువ్వు’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.