మంచు విష్ణును ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్

హీరో మంచు విష్ణు తనను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ట్వీట్ చేసారు. అయితే ఆయన్ని బ్లాక్ మెయిల్ చేసేటంత ధైర్యం ఎవరికుంటుంది…అందులోనూ ఎమోషనల్ గా అంటే..ఇంకెంవరు ఆయన కూతురే. మంచు విష్ణు కూతురు వివియానా చాలా తెలివైంది. ఆమె తన తండ్రిని బ్లాక్ మెయిల్ చేసి తనకు కావాల్సింది కొనిపించుకుందట. ఈ విషయాన్ని మంచు విష్ణు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తన పుట్టినరోజు కానుక కోసం తన కూతురు ఎలా బ్లాక్ మెయిల్ చేసిందో చెబుతూ ఓ ట్వీట్ చేశాడు.

‘డియర్ నాన్నా ఈ ప్రపంచంలో నాకు నువ్వెంతో ముఖ్యమైన, ప్రత్యేకమైనవ్యక్తివి. పుట్టినరోజు నాడు నేనేం కోరుకుంటానో అది కొనిస్తావ్. ఈసారి రోలర్ స్కేట్స్ కొనిస్తావ్ కదూ.. ప్లీస్ కొనిస్తావా..? అవునో కాదో టిక్ చెయ్’ అంటూ ఓ లేఖ రాసింది.ఆ లెటర్ ని ట్వీట్ చేసిన మంచు విష్ణు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి ఇది క్వాలిఫైఅవుతుందని అనుకుంటున్నా అంటూ కామెంట్ చేశాడు.

2009 లో విరానికా రెడ్డిని లవ్ మ్యారేజ్ చేసుకున్న మంచు విష్ణుకి 2011లో అరియానా, వివియానా జన్మించగా, ఈ ఏడాదిన వీరికి మరో మగబిడ్డ జన్మించాడు.