జూ. ఎన్టీఆర్ వస్తున్నారంటేనే ఆమెకు భయం, వణుకు

‘బిగ్‌బాస్‌’ షోకు తెలుగులో మంచి పాపులారటి దక్కిన విషయం తెలిసిందే. ఈ షో మొదటి సీజన్‌కు జూ. ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించటం బాగా కలిసి వచ్చింది. దాంతో ఈ షోకు ఓ రేంజిలో టీఆర్పీ రేటింగ్స్‌ లభించాయి. మొదటి సీజన్‌ కే మంచి రెస్పాన్స్ రావడంతో నిర్వహకులు సీజన్‌ 2ను ఏర్పాటు చేశారు.

‘బిగ్‌ బాస్‌ 2’ కు నాచురల్‌ స్టార్‌ నాని ఇంకొంచెం మసాలా అంటూ తనదైన స్టయిల్‌లో యాంకరింగ్‌ చేసే ప్రయత్నం చేసాడు. కానీ షోలో నాని వ్యవహరించిన తీరు వల్ల అంతటా విమర్శలు వెల్లువెత్తాయి.సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోలింగ్ చేసారు. దాంతో సీజన్‌ 3కి నాని హోస్టింగ్‌ చేసే ఛాన్స్‌ లేకుండా పోయింది. త్వరలో ‘బిగ్ బాస్ 3’ను ఆరంభించడానికి నిర్వాహకులు సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో జ్యోతి మాట్లాడుతూ .. ‘బిగ్ బాస్’లో పాల్గొన్నప్పుడు ఎన్టీఆర్ అంటే మా అందరికీ చాలా భయంగా ఉండేది. ఆయన వస్తున్నాడంటేనే అందరికీ వణుకుగా ఉండేది. ఎవరి గురించి ఏం మాట్లాడతాడోననే టెన్షన్ ఉండేది. ఆ షోను ఆయన ఎంతో సమర్థవంతంగా నడిపించాడు.

‘బిగ్ బాస్ 2’ విషయానికి వస్తే హౌస్ లో వుండే ఎవరికీ ఎలాంటి భయం లేకుండా పోవడం గమనించాను. ఎప్పుడు చూసినా అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అది చూసి .. ‘బిగ్ బాస్ 2’లో నాకు అవకాశం వచ్చి వుంటే బాగుండేదే అనిపించింది. ఈ షోను హైదరాబాద్ లోనే నిర్వహించడం వలన కూడా వాళ్లలో భయం .. టెన్షన్ లేకపోవడానికి మరో కారణంగా చెప్పుకోవచ్చు” అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.