ఏంటీ ట్రైలర్ ఇలా ఉంది? హీరో చూసుకోలేదా?

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘కవచం’. కాజల్‌, మెహరీన్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్‌ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. వంశధార క్రియేషన్స్‌ పతాకంపై నవీన్‌ సొంటినేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో… నీల్‌ నితిన్‌ ముఖేష్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తమన్ బాణీలు అందిస్తున్నారు. ‘అనగనగా ఓ రాజ్యం.. ఆ రాజ్యానికి రాజు లేడు. రాణి మాత్రమే.. ఆ రాణికి కవచంలా ఓ సైనికుడు’ అంటూ రీసెంట్ గా విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన లభించింది.కవచం, బెల్లంకొండ శ్రీనివాస్, తమన్,  ఈ ఆదివారం మరో ట్రైలర్‌ను విడుదల చేశారు.

Kavacham Theatrical Trailer || Bellamkonda Sai Sreenivas, Kajal Aggarwal, Mehreen Pirzada

యాక్షన్‌ సీన్స్ కు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ‘ప్రతి ఆటలోనూ గెలుపు, ఓటమి అనేవి రెండుంటాయి. ఓటమి నీ తలరాతా కాదు.. గెలుపు ఇంకొకడి సొత్తూ కాదు. వాటి స్థానం మారడానికి అర సెకను చాలు’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. అయితే ట్రైలర్ అనుకున్నంత ఇంట్రస్టింగ్ గా లేదు. ఇంతకు ముందు వచ్చిన టీజరే బాగుంది అంటున్నారు. 

 ‘ఓ క్రిమినల్‌ ఆడితే ఎలా ఉంటుందో నువ్వు చూపించావు.. ఇప్పుడు ఓ పోలీసు ఆడితే ఎలా ఉంటుందో నేను చూపిస్తా’ అంటూ బెల్లంకొండ శ్రీనివాస్‌ ఛాలెంట్ చేయడం హైలైట్‌గా నిలిచింది. ‘పద్మవ్యూహంలో ఆగిపోవడానికి నేను అభిమన్యుడ్ని కాదు రా.. పోలీస్‌..’ అనే పవర్‌ఫుల్ ‌డైలాగ్‌ ఆకట్టుకుంది. డిసెంబరు 7న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.