వైజ‌యంతి నుండి బిగ్ సినిమా

మ‌హాన‌టి చిత్రం నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెకక్కగా, ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొంద‌డ‌మే కాక‌, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్ళు రాబ‌ట్టింది. చైనాలోని షాంగై లో ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించారు. షాంగైలో ప్ర‌ద‌ర్శిత‌మ‌యిన తొలి ఇండియ‌న్ సినిమాగా మ‌హాన‌టి అరుదైన ఘ‌న‌త సాధించింది. ఇక ఇదే సంస్థ నుండి రీసెంట్‌గా మ‌హ‌ర్షి చిత్రం కూడా విడుద‌లైంది. ఈ చిత్రం మంచి విజ‌యం సాదించింది. ఇక త్వ‌ర‌లో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో పెద్ద ప్రాజెక్ట్ చేయ‌బోతున్న‌ట్టు అనౌన్స్ చేసింది ఆ చిత్ర నిర్మాణ సంస్థ‌. ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యేందుకు విజువ‌ల్ ఆర్టిస్ట్స్‌, డిజైన‌ర్స్‌, రైట‌ర్స్ కావాల‌ని అన్నారు. సెప్టెంబ‌ర్‌లో మా సాహ‌సయాత్ర ప్రారంభం అవుతుంది. మీ వివ‌రాల‌ని ఈ మెయిల్ ఐడీకి vymtalent@gmail.com పంపండి అని తెలిపారు