మహేష్ అయితేనేం…నేను తగ్గను, అంత ఇవ్వాల్సిందే

మహేష్ బాబు తాజా చిత్రం మహర్షి అన్ని సెంటర్లలోనూ కలెక్షన్స్ లో కుమ్మేస్తోంది. దాంతో అందరి దృష్టీ మహేష్ చేయబోయే తదుపరి చిత్రంపై ఉంది. ఇప్పటికే మహేష్ …అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఈ సినిమా జూన్ నుంచి సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. ఇదిలా ఉంటె ఇందులో అలనాటి నటి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.

అయితే ఈ చిత్రంలో నటించేందుకు విజయశాంతి ఐదు కోట్లుదాకా డిమాండ్ చేసిందని.. అయితే రెండు కోట్లు దగ్గర దాన్ని తెగ్గొట్టారని తెలుస్తోంది. అయితే ఈ బేరసారాల సమయంలో ఇది మహేష్ సినిమా అని, అంత పెద్ద సినిమా మీకు ప్లస్ అవుతుందంటూ ఏదో చెప్పబోతే విజయ శాంతి నవ్వేసిందిట. తను పెద్ద సినిమాలు ,సూపర్ హిట్ సినిమాలు చేసి వచ్చిన దాన్నే అని, నేను తగ్గాల్సిన పనిలేదు..అడిగినంత ఇవ్వగలిగితే చేస్తాను అని తేల్చి చెప్పిందిట. దాంతో నిర్మాతలు తల ఒగ్గక తప్పలేదుట.

ఇక ఒక్కసారి విజయశాంతి పోస్టర్ పై కనపడి, టీజర్ లో మెరవగానే ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఖచ్చితంగా ఆమె కమ్ బ్యాక్ సినిమాపై అందరి దృష్టి ఉంటుంది. దాన్ని నిర్మాతలు క్యాష్ చేసుకుంటారు. ఈ విషయం తెలుసుకాబట్టే విజయశాంతి ఆ ఎమౌంట్ ని అడిగిందంటున్నారు. అప్ప

ఇక విజయశాంతి హీరోయిన్ గా వెలుగుతున్న సమయంలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి దుమ్ము దులిపింది. ఆమె నటించిన రాములమ్మ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమా తరువాత ఈ లేడీ సూపర్ స్టార్ అనేక సినిమాలు చేసింది. అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఇన్నాళ్లకు తిరిగి పెద్ద తెరపై కనిపించబోతున్నది.