దిల్ రాజు చేత చెప్పించి..వరణ్ తేజ ని వంచుతున్నారు

కెరీర్ మొదట్లో కాస్త డల్ గా ఉన్నా ఫిధా సినిమాతో పుంజుకున్నాడు వరుణ్ తేజ. ప్రస్తుతం “అంతరిక్షం” సినిమాతో బిజీగా ఉన్న ఆయన దగ్గరకు ఓ చిత్రమై ఆఫర్ వచ్చినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదేమిటంటే…వరణ్ తేజ ని విలన్ గా చేయమని అడిగారట.హీరోగా చేస్తున్న వాడిని ఇలా అడగటం ఆశ్చర్యమే అనిపించినా ప్రాజెక్టుకు క్రేజ్ వస్తుందని భావించారట. అయితే వరణ్ తేజ మాత్రం ఆలోచనలో పడ్డారట.

పూర్తి వివరాల్లోకి వెలితే… 2014లో తమిళ్ లో “జిగర్ తండా” అనే సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ ని అందుకుంది. ఈ సినిమా లో సిద్దార్ద్ హీరో గా , బాబీ సింహా విలన్ గా నటించారు. ఈ సినిమా లో హీరో కంటే కూడా విలన్ కి ఎక్కువ క్రేజ్ లభించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని తెలుగు లో హరీష్ శంకర్ రీమేక్ చేయబోతున్నాడు. ప్రస్తుతం కథ పై వర్క్ చేస్తున్న హరీష్ శంకర్ ఈ సినిమాలో విలన్ పాత్రకి వరుణ్ తేజ్ అయితే పక్కగా సెట్ అవుతాడని భావిస్తున్నాడు. ఇంకా ఈ రీమేక్ పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

దిల్ రాజు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. దిల్ రాజు చెప్పడంతో జిగుర్తండా రీమేక్ కు ఓకే చెప్పాడని తెలుస్తుంది. అయితే సిద్ధార్థ్ పాత్రని తెలుగులో కొద్దిగా తగ్గించి విలన్ క్యారక్టర్ ఇంకాస్త పెంచుతారట. మరి సిద్ధు పాత్రలో ఎవరు నటిస్తారు అన్నది ఇంకా తెలియలేదు.

వరుణ్ తేజ్ ఇప్పుడు ఎఫ్-2 సినిమా చేస్తున్నాడు. అలాగే సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది.