ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ ఎంత లాస్ లో ఉందో అందరికీ తెలుసు. కరోనాతో సినిమా ఇండస్ట్రీ కూడా చాలా సమస్యలను ఫేస్ చేస్తోంది. సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి, థియేటర్లు మూతపడ్డాయి, ఆర్టిస్టులకు అవకాశాలు లేవు.. పెద్ద పెద్ద నటులు కూడా తమ పారితోషకాన్ని తగ్గించుకొని సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నారు.

హీరోలే కాదు.. స్టార్ హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, డైరెక్టర్లు, ఎడిటర్లు.. ఇలా ఇతర సాంకేతిక నిపుణులు కూడా కాస్త తమ పారితోషకాన్ని తగ్గించుకొని అయినా సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక చిన్న చిన్న ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి అయితే ఘోరంగా తయారైంది.
అయితే.. సినీ ఇండస్ట్రీ మొత్తం కష్టకాలంలో ఉన్నా… టాలీవుడ్ టాప్ యాంకర్లు మాత్రం తమ పారితోషకాన్ని కొంచెం కూడా తగ్గించలేదట. ఊ.. అంటే ఇంకాస్త పెంచేలానే ఉన్నారట.
ప్రస్తుతం థియేటర్లు మూతపడేసరికి.. జనాలంతా టీవీలకు అతుక్కుపోతున్నారు. దీంతో రకరకాల షోలను ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లు ప్రసారం చేయాల్సిన పరిస్థితి. దానికి ఖచ్చితంగా యాంకర్లు కావాల్సిందే. దీంతో యాంకర్లు కొండెక్కి కూర్చుంటున్నారు.
సాధారణంగా యాంకర్లకు ఇచ్చే రెమ్యునరేషన్ తో పాటు వాళ్లు షూటింగ్ కు వచ్చిన రోజు ఖర్చు అంతా షో యాజమాన్యమే భరించాల్సి ఉంటుంది. వాళ్లకు ఫుడ్డు దగ్గర్నుంచి.. మేకప్, కాస్ట్యూమ్స్ అన్నీ మేనేజ్ మెంట్ చూసుకోవాలి. వీళ్ల రెమ్యునరేషనే భరించలేకపోతున్నాం.. అంటే వీళ్ల ఎక్స్ ట్రా ఖర్చులను కూడా భరించాల్సివస్తోంది అంటూ షో యాజమాన్యాలు లోలోపల అనుకుంటున్నాయట.
ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారంటే?
ఇక టాప్ యాంకర్లలో సుమ ఒక్క షోకు 2 నుంచి 2.5 లక్షలు వసూలు చేస్తోందట. అనసూయ 2 లక్షలు, రష్మీ 1.5 లక్షలు తీసుకుంటుండగా… వర్షిణి, మంజూష లాంటి చిన్న యాంకర్లు 30 వేల వరకు తీసుకుంటున్నారట. ఇకపోతే శ్యామల 50 వేలు తీసుకుంటుండగా… శిల్పా చక్రవర్తి, గాయత్రి భార్గవి లాంటి వాళ్లు కూడా 2 లక్షలకు తగ్గడం లేదట. శ్రీముఖి కూడా అంతే.. మినిమం 2 లక్షలట ఒక్క షోకు.
మేల్ యాంకర్స్ లో సుధీర్, ప్రదీప్ మాచిరాజు ఒక్క షోకు 2 లక్షలు తీసుకుంటున్నారట. రవి కూడా అంతే. 2 లక్షలకు నయా పైసా తగ్గేది లేదంటున్నాడట.
