‘డిస్కోరాజా’తో నైనా బ్రేక్ వస్తుందా?

రవితేజ-వి. ఐ ఆనంద్ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డిస్కో రాజా’. పాయల్ రాజ్‌పుత్, నభానటేష్ కథానాయికలు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామ్ తాళ్లూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మరో హీరోయిన్ సీన్‌లోకి వస్తోందని తెలిసింది. ఆమె తాన్యా. 

హైదరాబాద్ లో జరగబోయే షెడ్యూల్ లో రవితేజ, ముగ్గురు హీరోయిన్ల పైనా చిత్రించే షెడ్యూల్ లో తాన్య చేరుతుందని అంటున్నారు. రవితేజ, ముగ్గురు హీరోయిన్లపై కీలక సన్నివేశాలు షూట్ చేస్తారని సమాచారం. అందం, అభినయంవున్న తాన్య టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నా ఇంతవరకూ సరైన బ్రేక్ రాలేదు. ఈ ‘డిస్కోరాజా’తోనైనా బ్రేక్ వస్తుందేమో చూద్దాం.