ఆ  కొరియా మూవీ రీమేక్ లో సమంత, డైరక్టర్ ఎవరంటే

                                                            (సూర్యం)

అవును..నిజమే త్వరలో సమంత..ఓ కొరియా రీమేక్ సినిమాలో చేయనుంది. పెళ్లి తరువాత తన పంథా మార్చుకుంది  సమంత. రొటీన్ గ్లామర్ పాత్రలు కాకుండా…కొత్త తరహా చిత్రాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.  రంగస్థలం చిత్రంలో రామలక్ష్మిగా డీగ్లామర్ పాత్రలో కేక పెట్టించిన సమంత త్వరలో ఓ ప్రయోగాత్మక పాత్రలో కనిపించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

 వివరాల్లోకి వెళితే.. మిస్ గ్రానీ టైటిల్ తో తెరకెక్కిన కొరియా చిత్రం సమంతకి, నిర్మాత సురేష్ బాబుకి, దర్శకురాలు నందినీ రెడ్డి కు పిచ్చ పిచ్చగా
నచ్చేసింది. 2014లో రిలీజైన మిస్ గ్రానీ చిత్రం కొరియాలో సంచలనం సృష్టించింది.  దాంతో వెంటనే సురేష్ బాబు రైట్స్ తీసుకోవటం డైరక్టర్ గా నందినీ రెడ్డిని ఎంపిక చేయటం జరిగిపోయింది. నందిని రెడ్డితో గతంలో సమంత జబర్దస్త్ అనే చిత్రంలో చేసింది. ఆ సినిమా వర్కవుట్ కాలేదు. అయితే ఈ సినిమా ఆల్రెడీ ప్రూవుడ్ సబ్జెక్ట్ కాబట్టి సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు. ఈ సినిమామలో 70 ఏళ్ల వృద్ధురాలిగా  సమంత కనిపించాలి.

ఇటీవల ‘యూ టర్న్‌’తో హీరోయిన్  ఓరియెంటెడ్‌ చిత్రాలకు న్యాయం చేయగలనని నిరూపించుకుంది సమంత. ఆ నమ్మకంతోనే ఈ కొత్త చిత్రానికి  సైన్  చేసినట్టు సమాచారం. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ప్రస్తుతం నాగచైతన్యతో కలసి ఓ చిత్రంలో నటిస్తోంది సమంత. ‘మజిలీ’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు. ఈ చిత్రం అనంతరం నందిని రెడ్డి చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నదని చెప్తున్నారు.