చిరంజీవిని సీక్రెట్‌గా క‌లిసిన స్టార్ డైరెక్ట‌ర్

                                        పూరీ ఈసారైనా వ‌ర్క‌వుట‌వుతుందా?

మెగాస్టార్ చిరంజీవి లాక్ డౌన్ స‌మ‌యంలో తీరిక స‌మ‌యాన్ని ఇంట్లోనే స్పెండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌మ‌యంలో ఆయ‌న త‌న వ‌ద్ద‌కు వ‌చ్చే ద‌ర్శ‌కులు వినిపించే క‌థ‌లు వింటున్నార‌ట‌. అలా సైలెంటుగా పూరి జ‌గ‌న్నాథ్ వినిపించిన క‌థ‌ను కూడా విన్నార‌న్న‌ది తాజా గుస‌గుస‌.

స్టార్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్‌ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అన్న సంగ‌తి తెలిసిందే. చాలాకాలంగా చిరుతో సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంత‌కుముందు చిరుతో `ఆటో జానీ` లాంటి అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైన‌ర్ చేయాల‌ని భావించాడు. క‌థ వినిపించినా వ‌ర్క‌వుట్ కాలేదు ఎందుక‌నో.

ఓసారి మీడియా ఇంటరాక్షన్ లో పూరి వివరించిన సెకండాఫ్ స్టోరి న‌చ్చ‌లేద‌ని చిరు చెప్ప‌డంతో పూరి తీవ్రంగానే హ‌ర్ట‌య్యాడు. అదేదో త‌న‌కే చెబితే మార్చుకుని వ‌చ్చేవాడిని క‌దా! అంటూ ఆవేద‌న చెందాడు. అయితే అప్ప‌టికి కుద‌ర‌క‌పోయినా ఆ త‌ర్వాత కూడా ప‌లుమార్లు పూరి చిరును క‌లిసే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ ఇన్నాళ్టికి బాస్ తో కుదిరింద‌ట‌. వారు మళ్ళీ క‌థాచ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. పూరి జగన్నాథ్‌ తన చిన్ననాటి అభిమాన హీరో చిరంజీవితో సినిమా చేయాలనే తన కలను నెరవేర్చుకుంటాడా లేదా? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్. లాక్ డౌన్ సమయంలో తాను రెడీ చేసిన ఓ స్క్రిప్టును చిరుకి వినిపించాడ‌ట‌. పూరి త‌దుప‌రి దేవ‌ర‌కొండ‌తో ఫైట‌ర్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేయాల్సి ఉండ‌గా.. చిరు ఆచార్య చిత్రంతో బిజీ. అవి రెండూ పూర్త‌యితే కానీ చిరు-పూరి సినిమా గురించి ఇప్పుడే చెప్ప‌లేం.