జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ ఇవ్వనుంది !

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. దక్షిణాది మూలాలున్న జాన్వీకపూర్ దక్షిణాదిన సినిమాల్లో నటిస్తారని పలు వార్తలు వినిపించాయి కానీ.. అవేవీ నిజం కావని తేలిపోయింది.అయితే మళ్లీ జాన్వీ సౌత్ ఎంట్రీకి సంబంధించిన వార్తలు ఎక్కువ అవుతున్నాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం జాన్వీ తండ్రి, నిర్మాత బోనీకపూర్, అజిత్, హెచ్.వినోద్ కాంబినేషన్‌లో నెర్కొండ పార్వై సినిమా రూపొందింది. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో జాన్వీకపూర్ నటిస్తారని టాక్. మరి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న ఈ వార్తలపై బోనికపూర్ ఎలా స్పందిస్తారో చూడాలి.